SAKSHITHA NEWS

సాక్షిత : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు . చింతకుంట విజయరమణ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఈ సంధర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ..

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి యుఎస్ఎ లో ప్రవాస భారతీయుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండి 9 సంవత్సరాలలో కరెంట్ సప్లై పై 60 వేల కోట్ల అప్పులు చేసి రైతులకు కూడా 24 గంటల కరెంటు ఎక్కడ కూడా రావడం లేదు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి నిన్న మొన్న TRS (BRS) నాయకులు ఎగురుతున్నారు. మీ డ్రామాలు, పగటి పూట వేషాలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని రెండు రోజుల నుండి కేటీఆర్ మరియు కేటీఆర్ కచరా నాయకులు అందరూ కలిసి రాష్ట్రంలో ఎగురుతున్నారు.ఈ తెలంగాణ రాష్ట్రంలో పలుమార్లు కరెంట్ బంద్ అవుతుంది అని.. మీరు కరెంట్ ఎక్కడ ఏ ఊరిలో ఇస్తున్నారో చెప్పాలని.. రాష్ట్రంలో మరియు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా పోదాం ఏ ఒక్క రైతును అయిన అడుగుదాం రైతులకు 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నువ్వు ఏ మొహం పెట్టుకొని పెద్దపల్లి కమాన్ దగ్గర ధర్నాలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఇవ్వరు మోసం చేస్తున్నారు అని ఏ మొహం పెట్టుకొని చెప్పావు అని…
అసలు పెద్దపల్లి నియోజకవర్గంలో 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో నీకు తెలుసా.. నీకు రైతుల గురించి వారి సమస్యల గురించి అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మరియు పెద్దపల్లి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు త్రీ ఫేస్ కరెంట్ పోతే పొద్దున వస్తుంది. మీరు రైతులకు ఇచ్చే కరెంట్ 8 గంటల నుండి 10 గంటల కన్నా ఎక్కువ రావడం లేదు.
మనోహర్ రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసేటప్పుడు నీకు అవగాహన ఉండాలి కదా…గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీరు నిన్నటి ధర్నాలు ఎందుకోసం చేసారో తెలుసా నీకు తెలియకుంటే నీ పార్టీలో ఉన్న కార్యకర్తలను రైతులను ఒక్కసారి అడిగి తెలుసుకో అని ఈ సంధర్బంగా విజయరమణరావు పేర్కొన్నారు.
ఈ BRS ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే రైతులకు ఋణమాఫీ చేస్తా అని చెప్పి వరకు మాఫీ చేయనందుకా..?
పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుల వడ్లు కటింగ్ పెట్టినందుకా..?దేనికి నువ్వు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నావు అని విజయరమణారావు విమర్శించారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎక్కడ కూడా వడ్ల కట్టింగ్ చేయలేదు.తడిచిన,రంగు మారిన,మొలకచ్చిన,ఒక్క గింజ తరుగు లేకుండా ఆ రోజు ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని
ఈ సందర్బంగా గుర్తుచేశారు.
BRS ప్రభుత్వానికి మరియు నాయకులకు కాంగ్రెస్ పార్టీ అంటే భయం మొదలయిందని,రైతులకు రుణ మాఫీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం మీదని స్ధానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పై మరియు BRS ప్రభుత్వంపై మండిపడ్డారు..రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన కరెంటు ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని ఈ సంధర్బంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS