SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన పలువురిని
నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం పరామర్శించారు. ప్రమాదాలలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మేడి ఉపేందర్, అక్కెనపల్లి అనిల్ లని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కొద్దిరోజుల క్రితం మేడి నరసింహ మరియు మస్కు శివకృష్ణ భార్య మరణించడంతో ఇరు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ కొమురయ్య, బట్టు ఐలేష్, కోతి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి ఎద్దులపురి కృష్ణ, ఏర్పుల పరమేష్, మైపాల్ రెడ్డి, మేడి కృష్ణయ్య, మేడి గోవర్ధన్, కొయ్యడి మీనయ్య, బెల్లి చెన్నయ్య, మేడి శ్రీను, మేడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS