మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

Spread the love

Former MLA Kuna Srisailam Goud who participated in Medchal Rural District Working Committee meeting

మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సమావేశం మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అధ్యక్షతన నాగారం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ యే ప్రత్యామ్నాయమని ప్రజలంతా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలన అంతం కావాలంటే బీజేపీ అధికారం లోకి రావాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఇంఛార్జ్ నరేందర్ , రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల, మున్సిపాలిటీల నాయకులు, పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page