SAKSHITHA NEWS

ఎస్సార్ నాయక్ నగర్ లోని మోడీ అపార్ట్ మెంట్స్ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎమ్మెల్యే విఫలం..


సాక్షిత : జీడిమెట్ల లో ఇటీవల మూసివేసిన కోపల్లి ఫార్మా పరిశ్రమ ఆవరణలో రాత్రి భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించడంతో, పక్కనే ఉన్న మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్ వాసులు ఏం జరుగుతుందో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మోడీ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించిన తర్వాత కూడా మంటలు ఆర్పకపోవడం, సమస్య పరిష్కారం కాకపోవడం అత్యంత దారుణమని అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎమ్మెల్యే వివేకానంద పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. 2018 ఎన్నికల సమయంలో ప్రజల ఇండ్ల మధ్య ఉన్న రసాయన ఫ్యాక్టరీలను వేరే చోటకు తరలిస్తామని మంత్రి KTR, ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అంతకుముందు సంబంధిత అధికారికి ఫోన్ చేసి తక్షణమే మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టాలని, ఇటువంటి పేలుళ్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోడీ బిల్డర్ అపార్ట్మెంట్ వాసులు, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS