SAKSHITHA NEWS


For unanimously electing Nagender Yadav as GHMC Standing Committee Member

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో వడ్డెర సంఘం వారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపార.

అనంతరం కాలనీలోని ప్రజలు రోడ్లు, యూజిడి, ఎలక్ట్రికల్ పోల్స్ సమస్యల గురించి కార్పొరేటర్ కి విన్నపించారు, కార్పొరేటర్ తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటానని కాలనీలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు స్పందిస్తూ ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశిస్తానని అన్నారు.

పాపిరెడ్డి కాలనీలోని వడ్డెర సంఘం వారి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా కృషి చేస్తూ సహాయపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపు యాదయ్య, ఇరగదీల్ల నర్సింలు, వరికుప్పల కృష్ణ, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బోదాసు ఎల్లయ్య, పరశురాములు, మల్లేష్, నర్సింలు, రవి, బాబు, బిక్షపతి, రాజు, వడ్డెర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS