కొండపల్లిలో ఘనంగా పూలే జయంతి.

Spread the love

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు .

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.

కొండపల్లి మున్సిపాలిటీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా ఉమ్మడి అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు , జనసేన జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బొలియాశెట్టి శ్రీకాంత్ , తదితర నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఇదే ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీజీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ

జ్ఞాన సముపార్జనతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమని గుర్తించి అందరూ విద్యావంతులు కావాలని ప్రజలను చైతన్య పరచిన గొప్ప దార్శనికత కలిగిన నవయుగ వైతాళికుడు పూలే అని అన్నారు. మహిళల విద్యాభాసంతోనే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యమని భావించి మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మహానుభావుల బాటలో అందరూ పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page