గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు

Spread the love

సాక్షిత : గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

అందులో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ మరియు నిజాంపేట్ రోడ్డు లో వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్యను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వరద నీటి కాల్వ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, పనులు సకాలంలో పూర్తి చేయాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,వర్షాకాలంను దృష్టిలో పెట్టు కొని వరద నీటి కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేశారు.ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని పనులలో వేగం పెంచాలని
పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది. రోడ్డు పై నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతామని, అనుసరించాల్సిన విధానాలపై అధికారుల తో చర్చించడం జరిగినది అని, GHMC ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్య పరిష్కరినికి కృషి చేయాలని , త్వరలోనే సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి ని తొలగించాలని, ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం ను తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహన దారులకు సుఖ ప్రయాణానికి బాటలు వేయాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని అధికారులకు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ .
వర్షకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్ ,ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు అదేవిధంగా నాలలో కూరుకుపోయిన చెత్త చెదరాంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ,మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, నాల మరియు ముంపు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. అదేవిదంగా వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని,పెండింగ్ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది .గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి  విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని  పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, అధికారులు తెలియచేసారు.

అదేవిధంగా ప్రజలు అందరు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమాత్రంగా ఉండలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని,ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, భారీ వానల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విజ్జప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్లు మహదేవ్, దేవి మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల రాజేందర్ కాలనీ వాసులు కుమార స్వామి, వెంకట్ రావు, నాగ వర ప్రసాద్, అంజయ్య, శ్రీనివాస రావు, కోటేశ్వర రావు, భాస్కర్, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page