SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలంలోని వేలిమినేడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ టిపి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి పోకల అశోక్ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ విగ్రహాని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తన పాలనా కాలంలో రైతుల అభ్యున్నతి కి కృషి చేసిన రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నంతకాలం ఆయన ఎల్లవేళలా తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరంజీవిలా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండలం పార్టీ అధ్యక్షుడు పల్లే రాజేందర్ గౌడ్, రామన్నపేట అధ్యక్షులు మేడ బోయిన వెంకటేశ్వర్ యాదవ్ నార్కట్పల్లి అధ్యక్షులు బాసని నరసింహాల చిట్యాల టౌన్ పార్టీ అధ్యక్షులు పోకల దామోదరు, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కొత్త పల్లి అబ్రహమ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS