SAKSHITHA NEWS

పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దంతూరి సైదులు గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ కొలను శివరాం రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ చక్కని సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షలలో సమయ పాలన పాటిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు గ్రామం నకు మంచి పేరు తేవాలని ఉన్నత చదువులు చదవి జీవితం లో ఉన్నత స్థానం లో స్థిర పడాలని స్ఫూర్తిని కలుగచేశారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ నర్సింహా, పుడమి సాహితీ వేదిక అద్యక్షలు బాల్ రెడ్డి, జాన్ ఆఫ్ఘన్,పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, రాపోలు శ్రీనివాస్, శోబారాణి, మల్లేష్, సరిత, మహాదేవి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS