SAKSHITHA NEWS

సూరారం లోని బీమా గార్డెన్స్ నందు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ అధ్వర్యంలో జరిగిన కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్ వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడతామని తెలియజేశారు. అభివృద్ధిని కొనసాగించేందుకు నవంబరు 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మునేశ్వరరావు, ఉపాధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి అంజి యాదవ్, అసోసియేషన్ సభ్యులు గౌరీ శంకర్, ఆర్. లక్ష్మణ్, ఎల్. రామకృష్ణ, ఎం. భీమ శేఖర్, చారి, దుర్గ, శ్రీనివాస్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 22 At 6.23.54 Pm

SAKSHITHA NEWS