SAKSHITHA NEWS

ప్రతి ఇంటి గడపలో తలుపు తట్టిన జగనన్న సంక్షేమ పథకాలు

సాక్షిత : మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గడపలో తలుపు తట్టాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం సచివాలయం-1లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు శుక్రవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ది గురించి వివరించి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు._

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలను స్వయంగా తెలుసుకుని దానికి అనుగుణంగా నవరత్నాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్యులు, పేదల కష్టం జగన్మోహన్ రెడ్డి కి తెలుసన్నారు. అందుకే నేడు కుల, మత, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరి మన్ననలను పొందుతున్నారని పేర్కొన్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అర్హతలు ప్రకారం పరిపూర్ణంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టే, ముఖ్యమంత్రి విశేష జనాదరణ పొందుతున్నారని వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోనే జమ చేస్తున్నారని వెల్లడించారు. ఇది చరిత్రలోనే నిలిచిపోయే జనరంజక పరిపాలన అని పేర్కొన్నారు. ప్రజల తరఫున సీఎం కి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS