ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో కరెంటు

Spread the love

ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో కరెంటు సమస్యలు పరిష్కారం
సాక్షిత : వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో పర్యటిస్తుండగా, గ్రామ ప్రజలు పలు విద్యుత్ సమస్యలు ఉన్నాయని తెలిపారు, ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించగా, పెండ్లిమడుగు గ్రామంలో విద్యుత్ శాఖ వారు, పలు విద్యుత్ సమస్యలు పరిష్కరించడం జరిగింది.

ఎమ్మెల్యే రాకతో విద్యుత్ సమస్యల పరిష్కారం కావడంతో, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, వికారాబాద్ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page