ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపుకు కృషి చేయాలి ఎచ్చెర్ల ఎమ్మెల్యే

Spread the love

ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపుకు కృషి చేయాలి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఎచ్చెర్ల నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులుతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు నెక్కల నాయుడుబాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోఅన్ని గ్రామాల్లో నాయకులు అందరూ పట్టభద్రులు ఓటర్లను కలిసి సీతంరాజు సుధాకర్ గెలుపు కోసం కృషి చేయాలని, విశాఖ రాజధాని ఏర్పాటుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి ఈ గెలుపును బహుమతిగా అందించాలని నాయకులను కోరారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు అవుతున్నాయని, నిరుద్యోగులైన పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని,నన్ను ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలోనాలుగు మండలాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,గ్రామ సచివాలయం కన్వీనర్లు,గృహ సారధులు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page