దుండిగల్ పోచమ్మ తల్లి బోనాలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి ఆహ్వానం…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ గ్రామంలో వచ్చే నెల 3 వ తేదీన జరగనున్న శ్రీ పోచమ్మ తల్లి బోనాలు & ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో దుండిగల్ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, బోనాల జాతరకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి శ్రీనివాస్ యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ ఎంపిటిసి లు బండారి మహేష్, కుంటి వెంకటేష్, బీజేవైఎం అధ్యక్షుడు ఆకుల విజయ్ సాయి, నాయకులు జిన్నారం నర్సింహా, హన్మంతు, శ్రీకాంత్, యువ శక్తి సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page