కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Spread the love

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణాలోని నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందంటూ మండిపడ్డారు హన్మంత్ రెడ్డి.. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని… ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు హన్మంత్ రెడ్డి. ఈ నిరసన దీక్షలో ఎన్ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, గోపాల్ రావు, గణేష్, అరుణ్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page