అధైర్య పడకండి.. అండగా ఉంటాం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

అధైర్య పడకండి.. అండగా ఉంటాం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సాక్షిత : కార్యకర్తల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం

మరో కార్యకర్త కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

గుమ్మడిదల

టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర వహించే కార్యకర్తలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు.

గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి సయ్యద్ రిజ్వాన్ అనే టిఆర్ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందించిన సమాచారంతో.. ఎమ్మెల్యే జిఎంఆర్ కార్యకర్త కుటుంబంతో మాట్లాడి అండగా ఉంటామని తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా 30 వేల ఆర్థిక సాయం అందించారు.

గుమ్మడిదల గ్రామానికి చెందిన దాసరి పెంటయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు కార్యకర్తల సంక్షేమానికి సైతం కృషి చేస్తున్నామని వారు తెలిపారు. కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులని గుండెల్లో పట్టుకుని చూసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page