బహదూర్ పల్లి గవర్నమెంట్ స్కూల్ లో అల్ఫహర పథకం ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, సిడిఎంఏ…

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ లో ఎర్పాటుచేసిన అల్ఫహర పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కమీషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమిలా సత్పతి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , ఎమ్మెల్యే కే పి వివేకానంద్ , తో కలిసి జ్యోతి ప్రజ్వాళన చేసి మొక్కలు నాటి ప్రారంభించారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతోమంది పేద పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించి వారి భవితవ్యానికి నాంది పలికిన వారు అవుతరన్నారు.. ఈ తరం పిల్లలు సి.ఎం కేసిఆర్ స్ఫూర్తి తో మరింత ముందుకు వెళ్లి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం స్కూల్ పిల్లలకు స్వయంగా వడ్డించి పిల్లలతో కలిసి అల్ఫహరాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ కమీషనర్ కె సత్యనారాయణ, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులూ, స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page