శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ

Spread the love

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; చింతల్ 128 డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్ (నెహ్రు నగర్) జిల్లా పరిషత్తు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు.

ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఈ పుస్తకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బిల్లా వెంకటేష్, ప్రతాప్ రెడ్డి, పాల కుమార్, ఓరుగంటి అఖిల్ సాయి, సాయిరాం రెడ్డి, రాము, నరేందర్ సింగ్, నర్సింహా, పుండరీకం, తులసీరామ్, గుండప్ప, నాగమణి, సంతోష్, చెన్నమ్మ, అశోక్, ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page