నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి

Spread the love
నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లా లావేరు మండల లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని సచివాలయం వద్ద బుధవారం సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంను నిర్వహించి లక్ష్మీపురం పంచాయతీకి సంబంధించిన 23 నూతన పింఛన్లు లను అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి అలాగే ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి,చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు జగనన్న ప్రభుత్వం లో నూతనంగా వచ్చిన పింఛన్లు పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని,ఆనాడు జన్మభూమి కమిటీ లాగా మెఖాలు చూసి ఫించన్ ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని,అర్హులైన ప్రతి పేద వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని అందుకు ఇదే ఉదాహరణ అని తెలిపారు.ఈ అభివృద్ధి ప్రతిపక్ష తెలుగుదేశం వారి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించార.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి,ఎంపీటీసీ కృష్ణారెడ్డి,చాట్ల రమణ,బాసి రామారావు,బోర రాజారావు,పంచాయతీ కార్యదర్శి మోజేష్ ప్రసాద్,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుతదితరులు పాల్గున్నారు.

Related Posts

You cannot copy content of this page