హక్కుదారులకు నిధులు పంపిణీ

Spread the love

సికింద్రాబాద్, జూలై 27 : చిలకలగుడా లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని అన్ని రీతుల్లో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. బోనాలు వేడుకల్లో భాగంగా 22 మంది ఆలయ హక్కుదారులకు ఆర్ధిక సాయం నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నివాసం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయం కార్యనిర్వహణాధికారి మహేందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఒక్కో హక్కుదరునికి రూ.అయిదు వేల మేరకు చెల్లించగా, దానిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆమోదంతో రూ.ఆరు వేలకు పెంచినట్లు ఈఓ మహేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page