సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ..

Spread the love

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సిఫార్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 21,33,600 రూ. విలువచేసే (20) సీఎం సహాయ నిధి చెక్కులను జెడ్ పి చైర్మన్ కమల్ రాజు తో కలిసి వివిధ లబ్ధిదారులకు అందజేశారు.


వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చయినా వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయ నిధి ద్వారా సహకారం అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పెను మార్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు.‌ ప్రవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యంతో వైద్య సేవలను పొందిన ఆర్థిక భారమైన నిరుపేదలకు కేసీఆర్ సీఎం సహాయ నిధి ద్వారా సహకారం అందించడం నిరుపేదలపై వారికున్న ఆలోచనలకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page