SAKSHITHA NEWS

Distribution of clothes to the poor

నిరుపేదలకు దుస్తులు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బుడుమూరు యువజన కమిటీ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామంలో 300 మంది మహిళలకు చీరలు అందజేశారు.ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలకు బట్టలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS