ఎంజీఆర్ చేతులు మీదగా విద్యార్థులకు శ్రీ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ

Spread the love

ఎంజీఆర్ చేతులు మీదగా విద్యార్థులకు శ్రీ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆదర్శ జూనియర్ కళాశాలలో శ్రీ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ కాంపీటేటివ్ పుస్తకాలు ఉచితంగా విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు చేతుల మీదగా అందించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంజీఆర్ మాట్లాడుతూ విద్యార్థులుకి సమాజం మీద అవగాహన కల్పించి,విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదిస్తే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.క్రమశిక్షణతో కూడిన విద్యతో దేశం అభివృద్ధి చెందుతుందని,శ్రీ శ్రీ ఫౌండేషన్ లక్ష్యంగా విద్యార్థులు కోసం చేపడుతున్నారని వారిని అభినందిస్తున్నాను అని తెలిపారు.అనంతరం ఫౌండేషన్ చైర్మన్ చిందు శ్రీకాంత్,న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ ఫౌండేషన్ ప్రశంస పత్రాలు అందజేసి విద్యార్థులకు ఆసక్తి కలిగించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రత్నకుమారి,స్కూల్ చైర్మన్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page