SAKSHITHA NEWS

దేవినేని ఉమా నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 13.4.2023.

పిల్లికి ఎలుక సాక్ష్యంలా పచ్చపత్రికను అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేలినా నమ్మేవారు ఎవరూ లేరు దేవినేని ఉమామహేశ్వరరావు..!

కొండపల్లి అడవిలో ఏం జరిగిందో ప్రజలందరికీ, ముఖ్యంగా టీడీపీ వాళ్లందరికీ తెలుసు. ఎవరు అక్రమంగా మైనింగ్ చేస్తే వాళ్ళను పట్టుకుంటారు.

వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, షాబాద గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని నేను కలెక్టర్ కు స్వయానా లేఖ రాశాను. నేను లెటర్ పెట్టిన తర్వాత దేవినేని ఉమా అక్కడకు వెళ్లి పరిశీలించి, హడావుడి చేశాడు.

తనకు వస్తున్న మంచిపేరు చూసి తట్టుకోలేక పాతకథలే మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ మీడియా ఎదుట దేవినేని ఉమా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.

విజిలెన్స్ అధికారుల నివేదికల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఎంత పెనాల్టీ వేయాలో విధాన నిర్ణయం ప్రకారం చర్యలు ఉంటాయి. నువ్వెవడివి పదిరెట్లు పెనాల్టీ వేయాలని చెప్పడానికి.

నువ్వు చేసిన అక్రమాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు. ముందు నువ్వు ఆ సొమ్ము కట్టు. పద్ధతి, సంస్కారంతో మాట్లాడితే నేను అదే రీతిగా తిరిగి సమాధానం చెప్తాను. నీ అతి తెలివితేటలు, పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు ఇకనైనా కట్టిపెట్టు.

స్టిక్కర్లు అంటిస్తాం..మా ఇష్టం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి చెప్పుకుంటూ తిరుగుతున్నాం.

నాలుగు సార్లు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం మంత్రిగా ఉండి, ఏనాడైనా సరే నీకు ఓట్లు వేసిన ప్రజల గుమ్మం నువ్వు తొక్కావా?

నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మీ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రింట్ చేసి, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, మీరు ఇచ్చిన 600 హామీల్లో ఏమైనా అమలు చేసి ఉంటే చెప్పుకో…!

మేము పథకాలు అమలు చేసాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. మా నాయకుడి స్టికర్ని మేము అంటించుకుంటున్నాం. మేము ఏ కార్యక్రమం చేసుకుంటే నీకెందుకురా..నాయనా..!

నువ్వేమో ఎక్కువ, తక్కువగా మాట్లాడుతుంటావు, మళ్లీ నేను నిన్ను ఏదైనా అంటే నీలుగుతుంటావ్…! నిన్ను ఎప్పుడో జనాభా లెక్కల నుంచి తొలగించేశాము.

నేను నిరంతరం ప్రజల్లో ఉంటే దేవినేని ఉమాకు ఈర్ష, ద్వేషం, అసూయ. తనకు ప్రజల్లో వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక ఇటువంటి బురదజల్లే కార్యక్రమాలు ఉమా చేస్తుంటాడు.

ఇటువంటి అవకాశ వాదులకు 2019 తరహాలోనే 2024 ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రజాలకు పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS