SAKSHITHA NEWS

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే సొసైటీలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ 25 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు మరియు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, అలాగే ఫ్రెండ్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో 45 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, షేక్ సుభాన్, చాంద్ సాబ్, జ్ఞానేశ్వర్, షబ్బీర్, తాజుద్దీన్, అబ్దుల్ రజాక్, షఫీ ఉద్దీన్, సలీం, నరసింహ, మోసిన్, యోగి రాజు, సందీప్, పర్వీన్ సుల్తానా, వెంకట నరసమ్మ, తాజ్ బీ, రుబీనా, ధనలక్ష్మి, ఈశ్వరమ్మ, వహీదా, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS