మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

Spread the love

మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


సాక్షిత : అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ తమ సత్తాను చాటుతున్నారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మెట్టుగూడ లో బీ ఆర్ ఎస్ మహిళా నాయకురాలు శ్రీమతి పోచమ్మ మరియు సరళ, బృందం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ పల్దోన్నారు.

సికింద్రాబాద్ లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలకు తాము శక్తి వంచన లేకుండా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామని, మహిళల స్వాలంభానకు కృషి చేస్తున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా అభ్యున్నతికి సాధికారతకు తాము కల్పిస్తున్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, వివిధ రంగాలకు చెందిన మహిళలను సత్కరించారు. కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత రమేష్ , బీ ఆర్ ఎస్ మహిళా నేతలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page