SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి డిప్యూటీ మేయర్ & సీనియర్ నాయకులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1కాలనీకు చెందిన కాలనీ వాసులు ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ను డిప్యూటీ మేయర్ కార్యాలయం వద్దా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ మేయర్ & సీనియర్ నాయకులు దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించి డిప్యూటీ మేయర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని తెలిపారు.ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్యదర్శి కుంటపల్లి రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షులు చంద్రయ్య, కాలనీ వాసులు శేఖర్, సుభాష్, మల్లేష్, సిద్ధయ్య, శేఖర్, రవి, సంజీవ్ కుమార్, బొదస్ రమేష్, శేఖర్, ఆంజనేయులు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS