మహాశివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్,కార్పొరేటర్

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో 191ఎన్టీఆర్ నగర్ లో మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ . అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది. వారు మాట్లాడతూ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై స్వామి దీవెనలు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంజునాథ్,28వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల రాము యాదవ్, 191ఎన్టీఆర్ నగర్ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షుడు శోభారాణి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, కాలనీ వాసులు మధు, రాజేష్ , శంబూ, పూర్ణ, మల్లారెడ్డి,అచ్యుత్, మల్లేష్, పవన్, నర్సింహా, ఉపేందర్, నర్సింహా నాయక్, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page