అబీబ్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు

Spread the love

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబీబ్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని ఎమ్మెల్యే గాంధీ అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సంస్కారం అలవడుతుందని ,మతసామరస్యానికి ప్రతీక ,అందరూ కల్సి ఉండాలని , గత ప్రభుత్వం హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగినది అని ,మానిఫెస్టోలో లేని అంశాలను కూడా ప్రవేశపెట్టినది అని ముస్లిం ల సంక్షేమానికి  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని,ముస్లిం ప్రజానీకానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని  ,షాదిముబారక్  పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడపిల్లకు  1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని .మైనారిటీ గురుకుల స్కూల్స్ ను ప్రారంభించడం జరిగినది . మైనారిటీ ల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం  పెద్ద పీట వేసింది అని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగినది,పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా, వారికీ ఎటువంటి లోటులేకుండా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పడం జరిగినది. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈదుగలకు అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని , ఆ దేవుడి కరుణకటాక్షాలు పొందేందుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు. ఈ విధమైన ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్,అన్వర్ షరీఫ్ ,అహ్మద్,నటరాజు, రవి యాదవ్,రహీం బాయి, సయ్యద్ మీరు అలీ,సయ్యద్ పాషా, నయీమ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page