SAKSHITHA NEWS

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ – దైధ రవీందర్

— కార్యకర్తలే పార్టీ కి పునాది

— వెంకటేశం కుటుంబానికి 50వేల ఆర్థికసాయాన్ని పంపిన ఎంపీ వెంకట్ రెడ్డి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామ ఎంపీటీసీ మర్రి వెంకటేశం ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
చెందారు. విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే 50 వేల రూపాయలను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ మరియు నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దైద రవీందర్ లతో పంపి వెంకటేశం కుటుంబ సభ్యులకు అందజేశారు.అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ లో మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కలిగించారు.
ఈ నెల 21న కోమటిరెడ్డి సుంకెనపల్లి గ్రామంకి వస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుండ్రంపల్లి సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, చిట్యాల మండలం సీనియర్ నాయకులు ఎస్కే ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపగోని సత్తయ్య, గంగాపురం ఉషయ్య , మరి లింగయ్య, మరి రవీందర్, మరి కృష్ణ, బుగ్గు కిరణ్, బాలరాజు, సాయికుమార్, మర్రి విజయ్, మర్రి శివ, బాలరాజు చరణ్, పవన్, మహేష్, షేక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS