సాయి నగర్ వెస్ట్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వెస్ట్ సాయి నగర్ లో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సాయి నగర్ వెస్ట్ కాలనీలో ఇప్పటికే తొంబై శాతం అభివృద్ధి పనులు పూర్తైయ్యాయని, పెండింగ్ లో ఉన్నవి రోడ్డు నెంబర్ 9, 10 లో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయి, సీసీ రోడ్డు నిర్మించవలసి ఉందని, పనులు త్వరలో ప్రారంభించి సీసీ రోడ్డు ను నిర్మిస్తామని అన్నారు. అలాగే రోడ్డు నెంబర్ 6, 8 మరియు 11 లలో డ్రైనేజీ లైన్ పెండింగ్ పనులు ఉన్నాయని వాటిని కూడా తొందరలో పూర్తి చేస్తామని కాలనీ వాసులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, ఉమేష్, సంతోష్ బిరాదర్, హోటల్ యజమాని నవీన్, సిబ్బంది ధీరజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page