ఛత్రపతి శివాజీ నగర్లో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 ఆల్విన్ కాలనీ డివిజన్ లో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని చత్రపతి శివాజీ నగర్ లో పర్యటించి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భూగర్భ డ్రైనేజ్ లైన్ ను మరియు త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్న సిసి రోడ్డును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ నగర్ కాలనీలో ఇంతకుముందు చిన్న డ్రైనేజీ లైన్ ఉండేదని, జనాభా పెరిగి కుటుంబాలు పెరగడంతో అది సరిపోక పొంగుతూ ఉండేదని, ఇప్పుడు పెద్ద డ్రైనేజీ లైన్ ను నిర్మించి సమస్యను పరిష్కరించామని అన్నారు.

అలాగే సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయి ఉంది కాబట్టి అతి త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తారని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, జి.అంజయ్య యాదవ్, కె.రమేష్, కె.కోటేశ్వరరావు, పోశెట్టిగౌడ్, సాయిగౌడ్, ఎల్.సాంబయ్య, ఎస్.సత్యనారాయణ, డి.జంగయ్య, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page