హిందూ స్మశానవాటికులను సుందరీకరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిఎచ్ఎంసి అధికారులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గల హిందు స్మశానవాటికలో కోటి యాబై లక్షల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు మరియు సంబంధిత అధికారులకు సూచించారు.

స్మశాన వాటిక ప్రహరి, వాకింగ్​ ట్రాక్ తో పాటు స్మశాన వాటికలో మొక్కలను పెంచి ఉద్యానవనం ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతిమయాత్రలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మశానవాటికకు కావలిసిన అన్ని వసతులు చేకూర్చుతామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, జగదీష్, మల్లేష్, వెంకటేష్, ఫారూఖ్, నాగరాజు, ఎఇ శివ ప్రసాద్, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page