SAKSHITHA NEWS

దేశపాత్రునిపాలెం హైస్కూల్ ని సందర్శింన కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం 79 వా పరిధి దేశపాత్రునిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో కార్పొరేట ర్ రౌతు శ్రీనివాస్ స్కూల్ ను సందర్శించారు.స్కూల్లో గల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం రుచి చూసి,ఇంకా నాణ్యత పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.అలాగే స్కూల్లో ముఖ్య సమస్యలైనా లైటింగ్ కావాలని, స్కూల్ హెచ్ఎం కోరారు.కార్పొరేటర్ గారు స్పందించి త్వరలో లైట్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.అలాగే నాడు నేడు లో పూర్తయిన బాత్రూంలను ఉపయోగించుకోవాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, గ్రామ పెద్దలుతదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS