ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

SAKSHITHA NEWS

సాక్షిత : * శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆరంభ టౌన్షిప్ లో ఆదివారం సాయంత్రం వేళ డైనమిక్ ప్యానెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ GHMC, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముస్లిం మైనారిటీ ప్రజలందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఇదేవిధంగా సంతోషంగా అన్ని పండుగలు చేసుకుని ఐక్యతను చాటాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రాజేష్, రెహనా బేగం, రాంభూపాల్ రెడ్డి, గోపాల్ యాదవ్, మహేష్, అరుణశ్రీ, శ్వేత, మౌలిక, దాసరి సరిత, కరిష్మా ఖాన్, జనార్ధన్, కుటుంబరావు, బిక్షపతి, బసవయ్య, నయీముద్దీన్, నరేంద్ర, నాగరాజు, సాయిరాం, షఫీ, మైనారిటీ సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS