శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడాట్రేడ్ సెంటర్ లోని రామాలయం, బీహెచ్ఈఎల్ ఎంఐజి, తారనగర్ తుల్జభవాని ఆలయం, ఆదర్శ్ నగర్, మాట్రీక్స్ అపార్ట్మెంట్, ఆరంభ టౌన్షిప్, సురభి కాలనీ, బాపునగర్, నల్లగండ్ల హుడా కాలనీ మరియు తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తదితర ఆలయ కమిటీ సభ్యులు, తదితర కాలనీ అసోసియేషన్ సభ్యులు వారిని శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా రాగం దంపతులు సీతారాముల కల్యాణ వేదికపై నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సీతారాముల ఆసిస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం ఆయా దేవాలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గురు శివరామ చంద్రమూర్తి , డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజి కౌన్సిలర్ సోమదాస్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రామ్ మోహన్, మహేష్, పవన్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, విజయందర్ రెడ్డి, గోపాల్ యాదవ్, తదితర ఆలయ కమిటీ సభ్యులు, తదితర కాలనీ అసోసియేషన్ సభ్యులు, భక్తులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page