అట్టహాసంగా జరిగిన ఇంటింటికీ కాంగ్రెస్ పాదయాత్ర కార్నర్ మీటింగ్.

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మార్పు కోసం ఇంటింటికీ కాంగ్రెస్ పాదయాత్ర లో భాగంగా నేడు కొంపల్లి లో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వింటుంటే అసలు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ మరియు మునిసిపల్ చైర్మన్ పూర్తిగా విఫలం చెందారని స్పష్టంగా అర్ధం అవుతుందని తెలిపారు.50 రూపాయలు ఉన్న నల్లా బిల్లు 1500 నుండి 2000 రూపాయలకు చేరుకుంది అంటే వీరి పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.


కొంపల్లి మునిసిపాలిటీ లో సమస్యలు తీర్చే వరకు స్థానిక కౌన్సిలర్ల సహకారంతో అదే విధంగా స్థానిక సీనియర్ నాయకులతో కలిసి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి,కొంపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,A- బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బోంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బైరి సరిత శివకుమార్ గౌడ్, మాజీ సింగల్ విండో చైర్మన్ యతి రాజా రావు, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం,PACS డైరెక్టర్ డప్పు నరేందర్, మాజీ వార్డు సభ్యులు కావలి గోపాల్,కృష్ణ,ఆదిరెడ్డి సురేందర్ రెడ్డి,జయభేరి గోపాల్ రెడ్డి,జయభేరి అశోక్ రెడ్డి, రాము గౌడ్,అదిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి,అంజి ముదిరాజ్,మల్లేష్ ముదిరాజ్, పెద్దబుద్దుల చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్,రాజశేఖర్ రెడ్డి,పాల్,నాగ సందీప్, వెంకట్ రెడ్డి, మరియు ఈరోజు పార్టీలో చేరిన సన్న భరత్ యాదవ్,ఎడమ రాజశేఖర్ రెడ్డి మరియు వారి మిత్రబృందం, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page