SAKSHITHA NEWS

  • ఇస్నాపూర్- ముత్తంగి క్రాస్ రోడ్ లో అభిమాని ఇంటికి వెళ్లిన నీలం మధు ముదిరాజ్. అభిమాని ఆతిథ్యాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ స్వీకరించారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ఇస్నాపూర్ ముత్తంగి క్రాస్ రోడ్ కు చెందిన అభిమాని సోఫియన్ ఆహ్వానం మేరకు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అతని ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా అభిమాని కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షేర్ కుర్మా సేవించి, భోజనం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ, అశోక్,ఎండీ మునీర్ ఉద్దీన్ ఎండి గౌస్ ఉద్దీన్, మదఫ్జల్ సోఫియాన్, సబీల్, షారుఖ్, సోహైల్, అహ్మద్, జహంగీర్, సమీర్, ఇమ్థియాజ్, నసీర్, యాసీన్, మజర్, సాబెర్, సక్లైన్ మోయిన్, అస్లాం, బాద్ షా తదితరులు ఉన్నారు.

SAKSHITHA NEWS