ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్

Spread the love

ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్(జీడిమెట్ల) లోని అంగడిపేట్ లో నిన్న కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా స్థానికులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కి తమ సమస్యలు విన్నవించుకోవడం జరిగింది.వర్షం పడిన ప్రతిసారి తమ ఇండ్లలోకి మోకాలు లోతు నీరు చేరుతుంది అని,నిన్న కురిసిన వర్షానికి రెండు ఇండ్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది అని,ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది.వారి సమస్యలు విన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి వెంటనే స్పందించి,స్థానిక పార్లమెంట్ సభ్యులు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తొందర్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అదే విధంగా స్థానిక శాసన సభ్యుడు, కార్పొరేటర్ ఈ సమస్యపై దృష్టి సారించాలని,పక్కనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపడుతున్న సంస్థ నాలాను కబ్జా చేసి నిర్మాణం చేస్తుంటే చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నించారు.తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కొరకు చొరవ చూపాలని,లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related Posts

You cannot copy content of this page