Confusion of posters in Amrabad.MLA Guvwala, who was sold for 100 crores
అమ్రాబాద్ లో పోస్టర్ల కలకలం..
100 కోట్లకు అమ్ముడు పోయిన ఎమ్మెల్యే గువ్వల అంటూ..
అచ్చంపేట : రాష్ట్రంలో ఫామ్ హౌస్ వ్యవహారం రోజు రోజుకు కొత్త కోణాలు బహిర్గతం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించి మరోసారి నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పై నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం లో ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం మండలంలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే..అమ్రాబాద్ మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి అచ్చంపేట ఆత్మగౌరవం 100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజని, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరుముదామని, ఓట్లేసి గెలిపించిన ప్రజలారా మేధావుల్లారా యువకుల్లారా విద్యావంతుల్లారా ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలని పోస్టర్లు పొందుపరిచారు. అలాగే వివిధ సందర్భాలలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ పోస్టల్ లో ముద్రించి మండల కేంద్రంలో అతికించారు. ఈ విషయం ప్రస్తుతం నియోజకవర్గంలో వాడి వేడిగా చర్చగా మారింది.
కేసులు పెట్టేందుకు...
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై గుర్తు తెలియని వ్యక్తులు అమ్రాబాద్ మండల కేంద్రంలో పోస్టల్ వేసిన తీర్పు నిరసనగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
శాంతిభద్రతలు..
ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం కావడంతో శాంతి పద్ధతులు విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీల రొంపిలో కొందరు అమాయకులను రంగంలోకి దింపి వారి జీవితాలతో చెలగాటం ఆడుకునే రాజకీయ నాయకులకు తగునా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ వేడి వాతావరణం లో ఒకరిపై ఒకరు విమర్శలు ఆందోళన కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలాన్ని వివాదాల్లోకి నెట్టేసి, పైశాచిక ఆనందం పొందడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని, కొందరు అమాయకులు బలి అవుతారని ఇలాంటి రాజకీయాలు సహేతుకం కాదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత…
Spread the love బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాముపదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా…
Spread the love కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో…
Spread the love స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..
Spread the love 2024-25వ విద్యా సంవత్సరం లో కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని /విద్యార్ధులు తేది 15.05.2024 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు సూర్యాపేట జిల్లా షెడ్యుల్డ్…
Spread the love జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే…