SAKSHITHA NEWS

ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్
ఖమ్మం బ్యూరో చీఫ్,

ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
సోమవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజాఫిర్యాదులను పోలీస్ కమిషనర్ స్వీకరించి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చిన ఫిర్యాదులలో
భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు,ఇతర ఫిర్యాదులు వరకు వచ్చాయి. ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. శిక్షణలో భాగంగా గ్రివేన్స్
కార్యక్రమంలో ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS