చెన్నారెడ్డి కాలనీ రోడ్ పనులు త్వరగా చేపట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్

Spread the love

తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీ నుండి టిటిడి అటవీ శాఖ కార్యాలయం మీదుగా హరేరామ హరేకృష్ణ మార్గంను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులను ఇంజినీరింగ్, టిటిడి అధికారులతో కలసి పరిశీలిస్తూ త్వరగా పనులను చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశించారు.

డి.ఎఫ్.ఓ ఆఫిసు వద్ద కౌంపౌండ్ ను కొంత మేర తొలగించి పనులు ప్రారంభించిన వెంటనే డి.ఎఫ్.ఓ ఆఫిసుకు కొత్త కౌంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోడ్డు పూర్తి అయితే చాలా ప్రాంతాలకు ఈ రహదారి సౌకర్యవంతంగా వుంటుందని చెబుతూ, మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు త్వరితతిన పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామి రెడ్డి, తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page