SAKSHITHA NEWS

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మ‌ధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది.

2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది.

కీలక రాష్ట్రాల్లో సీట్ల పంప కాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేం దుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు.

రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్‌రెడ్డిలూ సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు.

కాగా సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించా లనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నందున దానిని వాయిదా వేశారు..


SAKSHITHA NEWS