చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు

Spread the love

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ,ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లలో పచ్చదనం పరిఢవిల్లడానికి హరితహారం ఎంతగానో దోహదపడుతుంది అని, హరితహారం నిర్వహించడం జరిగినది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చని తెలంగాణా లక్ష్యంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరితహారం తో తెలంగాణ లో అడవుల శాతం పెరిగినది అని,
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలిఅని, మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని ,కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసునని కావున దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని , మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి అని ,నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని, మొక్కలు నాటాడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి,తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, ఎల్లం నాయుడు ,మోజేష్, ఆంజనేయులు, శర్మ, మల్లయ్య, స్వరూప, కవిత, సరిత ,పద్మ, సువర్ణ, సంగీత, స్వాతి, లక్ష్మి, రాణి ,స్వప్న, శివ తదితరులు పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page