చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం

Spread the love

మార్కాపురం పట్టణం. చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేసిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు – మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి * మార్కాపురం మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి జవహర్ నగర్ లోని స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడు లేనివిధంగా మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దిగ్విజయం చేశారని వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల సదస్సు, రోడ్ షో, బహిరంగ సభకు ప్రజలు పోటెత్తి ప్రజలు ప్రభుత్వంపై ఉన్న తమ వ్యతిరేకతను తెలియజేశారు అని ఇదంతా శుభ పరిణామం అని తెలిపారు.

సమయం లేకపోయినా కార్యకర్తలు బాధ్యతయుతంగా పనిచేసి తమ అధినేత మెప్పు పొందారని అందరికీ ధన్యవాదాలు అన్నారు. * వెలుగొండ ప్రాజెక్టును తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు 1996 సంవత్సరములో శంకుస్థాపన చేశారని తరువాత ప్రాజెక్టులో అతి ముఖ్య భాగమైన ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి పనులు ప్రారంభించారని కానీ తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయలేక పోయిందని అదే నాయకులు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారు అని 2019 సంవత్సరంలో ఒక సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ నాలుగు సంవత్సరాలు గడిచిన ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయింది అని వెలుగొండ ప్రాజెక్టు కు నాంది పలికింది చంద్రబాబు అని ఆ ప్రాజెక్టు పూర్తి చేసేది కూడా చంద్రబాబు గారే అని అన్నారు.

జిల్లాల పునర్విభజనలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఏర్పాటు చేశారని అయినా ఈ ప్రాంత వైసిపి నాయకులు నోరు మెదపలేదని మార్కాపురం లో చంద్రబాబు నాయుడు మార్కాపురం ప్రత్యేక జిల్లా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం లో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. * ఇక చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలను ప్రస్తావించారని అవి మీ వైసీపీ నాయకుడే మార్కాపురం నియోజకవర్గంలో 1000 కోట్ల భూకబ్జాలు జరిగాయి అని పత్రికా ముఖంగా ప్రకటిoచారని అవే మా అధినేత బయటపెట్టారు అని ఇవే కాదు చాలా ఉన్నాయి అని సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతామని అన్నారు. వైసీపీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని అవి వారి విచక్షణకే వదిలేస్తున్నాను అని అన్నారు. * మాజీ చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటన ను దిగ్విజయం చేసినందుకు నారాయణరెడ్డి కేక్ కట్ చేసి అందరికి పంచి సంబరాలు చేసారు. ** మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు పట్టణం లోని వివిధ మసీదులలలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు జరిపారు. * ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page