SAKSHITHA NEWS

కేంద్ర కార్మిక శాఖ మంత్రికి స్వాగతం సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతిలో గురు, శుక్రవారాల్లో(నేడు, రేపు) జరగనున్న అన్నీ రాష్ట్రాల కార్మిక మంత్రుల సదస్సులో పాల్గొనే నిమిత్తం తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు బుధవారం సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ (జెసి) డీకే.బాలాజీ, డీఆర్వో శ్రీనివాస రావు లు మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అంతకుముందు సదస్సు జరిగే తాజ్ హోటల్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు.


SAKSHITHA NEWS