SAKSHITHA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లోని primark cygnus అసోసియేషన్ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో సీసీ రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల పై ప్రభుత్వ విప్ గాంధీ కి వినతిపత్రం ద్వారా కోరడం జరిగినది .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల వంటి సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని, పార్క్ ను అభివృద్ధి చేస్తానని, సీసీ రోడ్లు, విధి దీపాల ఏర్పాటు కు కృషి చేస్తానని ,త్వరలోనే కాలనీ లలో పర్యటిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా కాలనీల లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులదరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీలు గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో రవీందర్ ప్రసాద్ దుబే తెరాస నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ మరియు కాలనీ వాసులు సత్యరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అర్వింద రెడ్డి, వాసుదేవ రావు, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS