తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బి.అర్. యస్…

Spread the love

స్థానిక సంస్థల,పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…

  • నాతో నడిచే వాళ్లకు నా అండ..

పట్టణ పార్టీ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి .

పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలను సరిద్దిద్దుకొనీ రాబోవు స్థానిక సంస్థల ఎం.ఎల్.సి,పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.దళిత బహజనులు అభివృద్ధి కోసం బి. యస్.పితో పొత్తు పెట్టుకోవడం జరిగిందని.ఈ రెండు నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజలలో నిత్యం కలసి ఉండాలని అన్నారు.

రెండు జాతీయ పార్టీలు బి.అర్. యస్ పార్టీని టార్గెట్ చేసుకొని చీకటి ఓప్పందాలు చేసుకున్నాయని తెలంగాణ ప్రయోజనాలు కోసం కె.సి.అర్ నాయకత్వం నిలుపుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.నాయకుల కార్యకర్తల పనితీరుపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని మీరు కూడా అంతే విశ్వాసముతో పని చేసి మన నియోజకవర్గంలో మెజారిటీ సాధించాలని అన్నారు.పట్టణ పార్టీ సమావేశములో ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page