లీలావతి హాస్పిటల్స్లో సాధారణ కాన్పు ద్వారా 2.7 కిలోల మగ శిశువు జననం
సాక్షిత : చిలకలూరిపేట పట్టణంలో తాజాగా ఒక సాధారణ డెలివరీ విజయవంతమైంది. లీలావతి హాస్పిటల్స్, చిలకలూరిపేటలో గర్భిణికి సుఖ ప్రసవం జరిగింది. ఆసుపత్రిలోని అనుభవజ్ఞురాలైన డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో ఈ ప్రసవం జరిగింది.తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జన్మించిన మగ శిశువు బరువు 2.7 కిలోలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ డెలివరీ జరగడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తల్లికి, శిశువుకు డాక్టర్ లావు సుష్మ మరియు ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
