SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ని గజమాలతో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోషి మహేశ్,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాది రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ ఓ‌బి‌సి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి సాధు యాదవ్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, 127 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్, మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫాతిమా,ధర్మారెడ్డి,సైఫుద్దీన్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS